కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన ధనుష్ చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఎన్నో కష్టాలు పడి స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయినప్పటికీ సొంతంగానే తన నటన టాలెంట్ ఉపయోగించి ప్రతి సినిమాకు మంచి క్రేజ్ ను పెంచుకుంటూపోతున్నాడు. ధనుష్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లు సమాచారం అందింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం అందింది . టాలీవుడ్ యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. తమిళంలో స్టార్ దర్శకుల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నా ధనుష్ మాత్రం ప్రస్తుతం తెలుగు ఇండస్ర్టీ పై దృష్టి పెట్టారు.

తెలుగు సినిమాతో ధనుష్ మంచి మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు.ఇప్పటికే పలువురు కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగులో డబ్బింగ్ సినిమాల ద్వారా తన మార్కెట్ ను బాగా పెంచుకోగా ధనుష్ కు మాత్రం తెలుగులో భారీస్థాయిలో మార్కెట్  అంతగా లేదు.తెలుగులో డైరెక్ట్ సినిమాతో వస్తున్న ధనుష్ రెమ్యునరేషన్ ను మాత్రం భారీగా పెంచారు అని టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ను సినిమాలో సాయిపల్లవి నటిస్తున్నారని గోసిప్ రాగ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించని శేఖర్ కమ్ముల ధనుష్ తో ఎలాంటి సినిమాను తీస్తారో తెలియాల్సి ఉంది. కెరీర్ లోపక్కా మాస్ పాత్రల్లో ఎక్కువగా నటించిన ధనుష్ శేఖర్ కమ్ముల సినిమాలోఎంత క్లాస్ గా కనిపిస్తాడో చూడాలు మరి.ధనుష్  టాలీవుడ్ లో మంచి హీరోగా సూపర్ స్టార్ ఇమేజ్ లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: