పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో భీమ్లా నాయక్ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటుండగా హరిహర వీరమల్లు ఇటీవల కొంత భాగం షూట్ జరుపుకుంది. అయితే వీటిలో ముందుగా భీమ్లా నాయక్ ని పూర్తి చేసి దానిని సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసిన పవన్, ఆపైన హరిహర వీరమల్లు బ్యాలన్స్ షూట్ లో పాల్గొననున్నారు.
కాగా భీమ్లా నాయక్ లో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా యాక్ట్ చేస్తుండగా దానిని సాగర్ కె చంద్ర తీస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతుండగా దీనిని క్రిష్ తీస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల తరువాత మరొక రెండు సినిమాలు కూడా ఇప్పటికే లైన్లో పెట్టారు పవర్ స్టార్. వాటిలో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ తో చేయనున్న సినిమా  కాగా మరొకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న మూవీ. అయితే వీటిలో హరీష్ శంకర్ సినిమా మూవీ కథ విని చాలా రోజుల క్రితం ఓకే చేసిన పవన్, నేడు దాని పూర్తి స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఆఫీస్ లో పవన్ ని కలిసిన దర్శకుడు హరీష్ శంకర్ మూవీని స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసినట్లు చెప్తున్నారు.

వారు కలిసిన పిక్స్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అసలు విషయం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి భవదీయుడు, భగత్ సింగ్ అనే టైటిల్స్ ని ప్రస్తుతం యూనిట్ పరిశీలిస్తోందని, త్వరలో వీటిలో ఏదో ఒకటి ఫైనల్ టైటిల్ గా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల టాక్. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీ గా ఇది తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ, ఈ రెండు టైటిల్స్ లో ఏది ఫైనలైజ్ అవుతుందో తెలియాలి అంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: