వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని
అఖిల్ హిట్టయితే సంపాదించలేకపోతున్నాడు కానీ హిట్ కొట్టాలనే
భావన మాత్రం ఆయనలో పెద్దగానే ఉంది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో
అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా తనకు తప్పకుండా మంచి హిట్ ను అందిస్తుందని భావిస్తుండగా హిట్లు ప్లాపులు తో సంబంధం లేకుండా
అఖిల్ మరొకవైపు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
అయితే ఈ
సినిమా కోసం
సురేందర్ రెడ్డి అక్కినేని
అఖిల్ తో భారీ ఫైటింగ్ లు యాక్షన్ సీక్వెన్స్ చేయిస్తున్నాడట. అవి అక్కినేని అభిమానులకు ఎంతగానో నచ్చుతాయన్న కాన్ఫిడెన్స్ వారిలో ఉంది. ఇకపోతే ఇటీవలే ఈ
సినిమా తర్వాత పవన్
కళ్యాణ్ తో తాను చేయబోయే
సినిమా ను అనౌన్స్ చేశాడు సురేందర్ రెడ్డి. మరి వరుస విజయాలతో ఉన్న ఆయన
అఖిల్ తో తన విజయాన్ని కొనసాగిస్తూ పవన్
కళ్యాణ్ సినిమా మొదలుపెడతాడా అనేది చూడాలి. మరోవైపు
అఖిల్ కూడా తన 6వ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే కొంతమంది దర్శకుల కథలు విన్న
అఖిల్ ఓ పెద్ద దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడట.