ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు అంతా కూడా తెలుగు సినిమా పట్ల ఆసక్తిని కనబరచడం మొదలైంది. కథాపరంగా  ఇంకా సాంకేతిక పరంగా అలాగే మార్కెట్ పరంగా తెలుగు సినిమా పరిధి పెరుగుతూ పోసాగింది. పాన్ ఇండియా సినిమా పతాకాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ ఎగరేసింది. దాంతో తెలుగు సినిమాను చిన్నచూపు చూసిన బ్యూటీలంతా ఇంకా ఇంత పారితోషికం ఇస్తేనే అంటూ బెట్టు చేసిన ముద్దుగుమ్మలంతా ఇప్పుడు టాలీవుడ్కి క్యూ కడుతున్నారు.పూరి జగన్నాథ్ ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతున్న 'లైగర్' సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తరువాత చేయనున్న 'జన గణ మన' సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్లో అడుగుపెడుతుందని సమాచారం తెలుస్తుంది.ఇక ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడమే అందుకు కారణం. ఆల్రెడీ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో చేసిన అలియా భట్ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎన్టీఆర్ కి జోడీగా కొరటాల సినిమా చేయడానికి అంగీకరించింది. ఇక తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా అద్వాని కూడా మరోసారి చరణ్ సరసన మెరవడానికి అంగీకరించడం విశేషం.



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేసిన 'గని' సినిమాలో ఆయన సరసన అందాల సందడి చేయడానికి సయీ మంజ్రేకర్ కూడా సిద్ధమవుతోంది. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమా ద్వారా సాక్షి వైద్య పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మాస్ మహా రాజా రవితేజ రీసెంట్ గా పట్టాలెక్కించిన 'టైగర్ నాగేశ్వరరావు' ద్వారా పరిచయమవుతున్న కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా పరిచయం అవుతుంది.ఇక అలాగే సూపర్ హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్న 'ప్రాజెక్టు K' సినిమాలో ఆయన సరసన దీపికా పదుకొనే చేయడం కూడా పతాకస్థాయిగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ బ్యూటీలు ఇప్పుడు టాలీవుడ్ లో చేయడాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉండటం విశేషం. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలను సూచించే పరిణామాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: