గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా మెగా హీరోలు నటించిన చిత్రాలు అన్ని ఎక్కువగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇక ఈ ఏడాది మొదట్లో పవన్ కళ్యాణ్ నటించిన భిమ్లా నాయక్ చిత్రం హిట్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత గని మూవీ విడుదల కాగా అది కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక తాజాగా ఆచార్య చిత్రం విడుదల కాగా ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ ని చవి చూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరు కలిసి నటించారు.


దీంతో మెగా హీరోలు సైతం చాలా నిరుత్సాహ చెందారని చెప్పవచ్చు.. ధింతో మెగా అభిమానులు సైతం పవన్ కళ్యాణ్, చిరంజీవి నటిస్తున్న సినిమాల పైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబి డైరెక్షన్లో మరొక చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, భగవంతుడు భగత్ సింగ్ తో పాటుగా మరో ఒక తమిళ సినిమాలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరూ ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలనే తెరకెక్కిస్తుంటే.. మెగా హీరోలు మాత్రం వీటిని అస్సలు పట్టించుకోలేదు.

అయితే మెగా హీరోలందరి తో పోల్చుకుంటే రామ్ చరణ్ మాత్రం కాస్త ముందు వరుసలో ఉన్నాడు అని చెప్పవచ్చు..RRR చిత్రం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RC-15 శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవలో విడుదల చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కంటే అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రనికే ఎక్కువగా  లైనప్ ఉందని చెప్పవచ్చు. పుష్ప చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న బన్నీ.. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తున్నాడు బన్నీ.RRR చిత్రం తో రామ్ చరణ్ మంచి క్రేజ్ సంపాదించుకో గా ఆచార్యతో ఆ క్రేజ్ అంతా పోయిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం వీరందరితో పోల్చుకుంటే అల్లు అర్జున్ నే ముందు ఉన్నాడని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: