సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. మొదటి నుండి ఈ సినిమా పై అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ వంటి పెద్ద స్టార్ తో తీస్తున్న ఈ సినిమా ప్రారంభం నాటి నుండే అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించింది.

మొదటగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ దగ్గరి నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా సినిమాపై రోజు రోజుకు అందరిలో భారీ స్థాయిలో అంచనాలు పెంచేసాయి. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందించగా కోలీవుడ్ నటుడు సముద్రఖని విలన్ పాత్ర చేసారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి తదితలు కీలక పాత్రలు చేసిన సర్కారు వారి పాట మూవీ బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు ఫ్రాడ్స్ నేపథ్యంలో జరిగిన కథగా సాగుతుందట. ఈ మూవీ ఫస్ట్ షో ప్రీమియర్ టాక్ అదిరిపోయినట్లు సమాచారం. ఇక హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలోతన అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మనసు గెలవడం ఖాయం అంటున్నారు.

ఆయన స్టైల్, డైలాగ్స్, అయితే అదరహో అనే రేంజ్ లో ఉన్నాయని, సినిమాలో చాలా సన్నివేశాల్లో మహేష్ ఎంతో సహజత్వ నటన కనబరిచారని, ముఖ్యంగా హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ అయితే తన అందంతో ఎంతో ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. ఇక మహేష్, కీర్తి ల మధ్య వచ్చే లవ్ సీన్స్ అయితే సూపర్ అట. సినిమాలో సాంగ్స్ తో పాటు మహేష్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్, భారీ ఫైట్స్, మధ్యలో వచ్చే ఛేజింగ్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటివి సర్కారు వారి పాట మూవీకి మంచి సక్సెస్ ని అందించాయని, ఇక దర్శకుడుగా పరశురామ్ కి నూటికి నూరు మార్కులు వేయవచ్చని చెప్తున్నారు. పక్కాగా సాగే యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా సాగె సర్కారు వారి పాట మూవీ రాబోయే రోజుల్లో పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: