హిందీ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ హీరో తాను నటించిన హిందీ మూవీ ల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే గత కొంత కాలం సినిమా లకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం మాత్రం వరుస మూవీ లను నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం షారుక్ ఖాన్ "పఠాన్" అనే పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , దీపికా పదుకొనే ఈ మూవీ లో షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక అదిరిపోయే యాక్షన్ టీజర్ ను చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 25 వ తేదీన హిందీ , తెలుగు , తమిళ భాషల్లో మూవీ యూనిట్ విడుదల చేయబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క యాక్షన్స్ సన్నివేశాలను 8 దేశాల్లో చిత్రీకరించినట్లు చిత్ర బృందం తాజాగా తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: