
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లలో మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో వస్తోన్న సినిమా ఒకటి. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతోంది. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త మేకోవర్తో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చేసింది.
ఇంకా షూటింగ్ దశ లో ఉండగానే ఈ సినిమా కు అదిరిపోయే బిజినెస్ డీల్స్ వస్తున్నాయట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగని విధంగా భారీ రేటు చెల్లించి ఈ సినిమా ఓటీటీ రైట్స్ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలో నే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర అల్టిమేట్గా ఉండబోతుందట. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు