
త్వరలోనే డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న బిగ్ బడా ప్రాజెక్ట్ "కలం". భారతదేశపు మాజీ రాష్ట్రపతి, మిసైల్ మాన్గా ప్రసిద్ధి చెందిన ఏ.పీ.జే. అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించడం సినిమాకి మరింత హైలైట్. ధనుష్ ఎంచుకునే సినిమాలు మంచి కంటెంట్తో ఉంటాయని అందరికీ నమ్మకం ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో "కలం" సినిమా మరింత హిట్ అవుతుందన్న నమ్మకం అందరిలో ఉంది. 2025 మేలో జరిగిన ఒక ఈవెంట్లో ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేసినా సినిమాపై బోలెడంత హైప్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఓం రౌత్ మాట్లాడుతూ "కలం" బయోపిక్పై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేలా వ్యాఖ్యానించారు.
“డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం పాత్ర పోషించడానికి చాలా మందిని వెతికాను, సంప్రదించాను. కానీ ధనుష్ కంటే మంచి నటుడు ఎవరూ కనిపించలేదు. ఆ పాత్రకు ఆయన మాత్రమే సరిపోతారు. ఆయన అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ధనుష్ అద్భుతమైన నటుడు. ఎలాంటి పాత్రలైనా సులభంగా పోషిస్తాడు. నేను నిజంగా పని చేయడానికి ఇష్టపడే నటుడు ఆయన మాత్రమే. కలాం జీవితంలో ఏ భాగాన్ని ఎంచుకుని సినిమా చేయాలనేది పెద్ద సవాలుగా మారింది. కానీ ఈ సినిమాను అందరికీ స్ఫూర్తిదాయకంగా అందిస్తానన్న నమ్మకం నాకుంది,” అని ఓం రౌత్ తెలిపారు.
అయితే ‘ఆది పురుష్’ సినిమాలో ప్రభాస్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసిన ఓం రౌత్ ఇలా ధనుష్ను మాత్రమే హైలైట్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్కు నచ్చలేదు. “ప్రభాస్ మంచి నటుడు కాదని చెప్పాలనుకున్నావా? ధనుష్తో పాటు మిగతా వారినీ ప్రస్తావించాలి. ధనుష్ మాత్రమే గొప్ప నటుడు అంటే ఎలా?” అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరికొందరు ప్రభాస్ అభిమానులు ఘాటుగా స్పందిస్తూ, “ఆ డైరెక్టర్ ఓం రౌత్ మాటలకు అంత విలువ లేదు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం “ప్రభాస్ను అవమానించాడు ఓం రౌత్” అంటూ డైరెక్టర్పై సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతోంది.