డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ టెంపర్ తర్వాత హిట్ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో పూరి చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. జూలై 18న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో అయినా పూరి హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. అయితే తన సినిమా రిలీజ్ కు ముందే మరో సినిమాకు లైన్ చేసే పూరి ఇస్మార్ట్ రిలీజ్ ముందే బాలకృష్ణని కలిశాడట.  


పైసా వసూల్ సినిమాతో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు మరో సినిమా చేస్తారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణకు సరిపడే లైన్ తో కొన్నాళ్ల క్రితం కనబడగా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట బాలయ్య. అంతేకాదు ప్రస్తుతం చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ హిట్ కొడితేనే తన సినిమా ఛాన్స్ ఇస్తా అన్నాడట.


అందుకే పూరి రామ్ సినిమాను కసితో తీశాడు. అయితే టీజర్ ట్రైలర్ సినిమా కేవలం మాస్ ఆడియెన్స్ కు మాత్రమే అన్న విధంగా కొడుతున్నా అసలు కథ మాత్రం అందరికి సర్ ప్రైజ్ ఇస్తుందట. రామ్ కూడా జగడం సినిమా తర్వాత పూర్తిస్థాయిలో మాస్ హీరోగా చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్.


కచ్చితంగా పూరికి, రాం కు ఈ సినిమా హిట్ అవసరం. పూరికైతే ఈ సినిమా ఫలితంపైనే అతని తర్వాత కెరియర్ ఆధారపడి ఉంటుంది. సినిమాలను హిట్ చేసేది బి, సి సెంటర్ ఆడియెన్సే అన్న నమ్మే పూరి వారిని టార్గెట్ చేసుకునే ఇస్మార్ట్ శంకర్ తీశాడు. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: