వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య పై ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘రోజులు గడుస్తూనే ఉన్నాయి. పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఒక సమాజంగా మనం విఫలమవుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నా విన్నపం ఏంటంటే.. ఇలాంటి భయంకరమైన నేరాలను అరికట్టడానికి మరిన్ని కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అంతా కలిసి మహిళలకు అండగా నిలుద్దాం.. భారతదేశాన్ని సురక్షితంగా మార్చుదాం’’ అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
https://mobile.twitter.com/urstrulyMahesh/status/1200995843555225600?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Etweet

అయితే మహేష్ బాబు ఒక వీడియోలో పంక్తులు చదువుతూ మగవారికి వాళ్ల బాధ్యతను గుర్తు చేస్తాడు.. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. అది మీకోసం..


ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో..
ఎవరి మాట మన్ననగా ఉంటుందో..
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..
ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో..
ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి, ఆత్మకి విలువిస్తారో..
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరి మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో..
స్త్రీకి శక్తి ఉంది.. గుర్తింపు ఉంటుంది.. గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తి అనుకుంటారో..
ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు..
ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడే మగాడు.. 

 

అందరి లాగా కాకుండా మగవాళ్ళకి అందరకు ఈ మాటలను చెప్తూ మహేష్ బాబు గొప్ప పని చేశారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
https://youtu.be/BXZXLTtKlYs

మరింత సమాచారం తెలుసుకోండి: