కరోనా విజరుంభిస్తున్న నేపథ్యంలో కాలేజ్ కి సెలవులు కావడంతో యువకుడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని బయటకు వెళ్లడం మొదలుపెట్టింది.అక్కా, తమ్ముడే కదా అని ఎవరు వారిని పట్టించుకోలేదు. ఇలా కొన్నిరోజులు సాగిన వీరి ప్రేమాయణం, పెళ్లి చేసుకోవాలనుకొనేవరకు వచ్చింది. విషయం తెలిస్తే ఇంట్లో ఒప్పుకోరని అనుకున్న ఈ అక్కాతమ్ముళ్లు ఇంట్లోనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లపోవడానికి ప్లాన్ వేసింది. తమ్ముడిని ఇంటికి రప్పించి ఇంట్లో ఉన్న నానమ్మకు తమ్ముడితో కలిసి మామిడి తోటకు వెళ్తున్నా అని అబద్దం చెప్పి అతడితో వెళ్ళిపోయింది.
సాయంత్రం పనులకెళ్ళి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురికోసం ఆరాతీయగా తమ్ముడితో కూతురు వెళ్లిపోయిందని తెలిసి కుప్పకూలిపోయారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్కాతమ్ముళ్ల కోసం గాలిస్తున్నారు. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ప్రేమ అనే ముసుగులో యువత ఇలా వావి వరసలు మరిచి ప్రేమలో పడటం చాలా సిగ్గు చేటు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బాధాకర విషయం.