అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వివాదం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దూకుడును మరింతగా పెంచారు. పెగాసస్ వివాదంపై రాష్ట్రంలో ఓ కమిటీని వెయ్యాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు ఆమె వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీని కలిశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు.
దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్, గ్యాస్ ధరలపై మండిపడ్డారు మమతా బెనర్జీ. ప్రతి ఒక్కరి నినాదం దేశాన్ని రక్షించడమే అని తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలతో చర్చించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఐక్యత విషయంలో నెలకొన్న సమస్యపై కూడా చర్చించామని తెలిపారు దీది.
మోడీ-షాలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే ఢిల్లీ కి వచ్చిన మమతా తాజా ప్రకటనతో మరింత రాజకీయ వేడిని సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల నాయకురాలిగా ఈ తృనముల్ అధినేత్రి ఉంటుందేమోననే ఊహాగానాలు కూడా మొదలయ్యా. మొత్తానికి 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి బెంగాల్ లాంటి షాకివ్వాలని మమత గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.