ఇవాళ ఉదయం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో తెలుగు రాష్ట్రాలలో విషాదం నెలకొంది.ఆయనకు అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ మంచి స్నేహితులు ఉన్నారు.తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి మంచి పేరున్న నేత కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన బంధం సుదృఢమైంది.ముఖ్యంగా ఆయన వివాదాలకు దూరంగా ఉండే నైజమే ఇంతకాలం ఇంతమంది స్నేహితులను పోగేసుకునేలా చేసి ఉంటుంది.ఆంధ్రా అనేకాదు తెలంగాణ నేతలతోనూ ఆయన నెరపిన సన్నిహిత బంధాలు కారణంగా కేటీఆర్ మొదలుకుని మిగతా నేతలంతా గౌతం రెడ్డికి నివాళులు ఇచ్చి ఆయనతో ఉన్న తమ బంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు.
ఇవాళ ఉదయం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో తెలుగు రాష్ట్రాలలో విషాదం నెలకొంది.ఆయనకు అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ మంచి స్నేహితులు ఉన్నారు.తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి మంచి పేరున్న నేత కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన బంధం సుదృఢమైంది.ముఖ్యంగా ఆయన వివాదాలకు దూరంగా ఉండే నైజమే ఇంతకాలం ఇంతమంది స్నేహితులను పోగేసుకునేలా చేసి ఉంటుంది.ఆంధ్రా అనేకాదు తెలంగాణ నేతలతోనూ ఆయన నెరపిన సన్నిహిత బంధాలు కారణంగా కేటీఆర్ మొదలుకుని మిగతా నేతలంతా గౌతం రెడ్డికి నివాళులు ఇచ్చి ఆయనతో ఉన్న తమ బంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు.