ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా చాలా ప్రాంతాలలో దాడులు కొనసాగుతూ ఉన్నాయి.. ఆంధ్రాలో అనేక ప్రాంతాలలో కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి ముఖ్య కారణం టిడిపి పార్టీ ఓటమి అన్నట్టుగా వైసిపి నేతలు తెలియజేస్తున్నారు.. ఆంధ్రాలో ఇలాంటి దాడులు జరగడానికి ముఖ్య కారణం చంద్రబాబే.. మరొకసారి వైయస్సార్ పార్టీ అధికారంలోకి వస్తుందని విషయం తట్టుకోలేకనే చంద్రబాబు ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు..


ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని తెలియజేస్తున్నారు. జూన్ 4వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త చరిత్రను సైతం సృష్టించబోతోంది అంటూ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం కూడా రాబోతోందని తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే ఒక యుద్ధమని యుద్ధంలో ప్రజలు ఒక నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని తెలియజేస్తున్నారు. పేదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేశారని అందుకే వారిపైన దాడులు చేస్తున్నారంటూ పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు.


చంద్రబాబు నాయుడు ప్రెస్టేషన్లోకి వెళ్లిపోయాడు పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల పైన దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు నేతలు..పలు ప్రాంతాలలో సెక్యూరిటీ పెంచాలని కోరినప్పటికీ ఎలక్షన్ కమిషనర్ అసలు పట్టించుకోలేదని పలువురు నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. కేంద్రంతోనే కుమ్మక్కైన చంద్రబాబు ఎన్నికలలో అవినీతి అక్రమాలకు పాల్పడి పోలీసులను టిడిపికి కొమ్ముకాసేలా చేసుకుంటున్నారని వైసిపి నేతలు తెలియజేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన పోలీసుల పైన విచారణ జరిపించాలి అంటూ కూడా కోరుతున్నారు.. వైయస్సార్ పార్టీకి అండగా నిలిచిన ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పగబట్టుకొని టిడిపి వాళ్లు దాడులు చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాలో పడకుండా టిడిపి నేత అడ్డుకున్నారని వైసీపీ పార్టీ నేతలు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: