గత వైసిపి పాలనలో కూడా అంబులెన్స్ల ద్వారా ఎన్నో మెరుగైన సేవలను అందించామని , కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని తమ సంపాద కోసం ఉపయోగించుకుంటోంది, తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో కొత్త అంబులెన్స్లను తీసుకువచ్చి, సాంకేతికంగా వాటిని మరింత అభివృద్ధి చేసే 24X7 ఉండే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ అంబులెన్సులు పల్లెలలో పట్టణాలలో ప్రజలకు అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతున్నాయని ఇప్పుడు వాటిని కూటమి ప్రభుత్వం భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి అప్పగించారు.
అయితే ఆ సంస్థ డైరెక్టర్ టిడిపి నేత డాక్టర్ పవర్ కుమార్ దోనేపూడి అంటూ తెలియజేశారు. ఈయన గతంలో టిడిపి డాక్టర్స్ సెల్ అధ్యక్షుడిగా ఉండేవారు.. అందుకే ఆయనకు అప్పగించారు. ఇందులో రూ .2000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ , ఈ సంస్థ టర్నోవర్ కేవలం రూ. 5.52 కోట్లు మాత్రమే అలాంటి ఆర్థిక సహాయం లేనటువంటి సంస్థకు 108,104 వంటి నిర్వహణ కాంట్రాక్టులను ఎలా అప్పగిస్తారు?.. GVK, EMRI వంటి సంస్థలను కాదని టిడిపి నేతకి అప్పగించడానికి కారణం టీడీపీ పార్టీ రూ.31 కోట్ల రూపాయలు ప్రతినెలా తీసుకుంటోంది అంటూ తెలియజేశారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి