ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు లో ఎవరిని ఓపెనర్ జోడి గా  బరిలోకి దింపుతున్నారు అనేదానిపై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం భారత జట్టు లోనే కాదు ఆస్ట్రేలియా జట్టు విషయంలో కూడా ఇలాంటి తరహా చర్చ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ కి జోడిగా ఏ ఆటగాడిని బరిలోకి దింపుతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడుతున్నది . సాధారణంగా అయితే గత కొన్ని రోజుల నుంచి డేవిడ్ వార్నర్ లతోపాటు ఆస్ట్రేలియా జట్టులో జో బర్న్స్  ఓపెనింగ్ చేస్తూ వస్తున్నాడు.



 కాని ప్రస్తుతం భారత్ తో జరగబోయే మ్యాచ్ లలో మాత్రం ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ మార్పులు ఉండే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన యువ సంచలనం విల్ పుకోవ్ స్కి నీ ఓపెనర్గా రంగంలోకి దించేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయించింది అన్నది ప్రస్తుత సమాచారం. దీనికోసం దిగ్గజ ఆటగాడు అయిన వార్నర్  అభిప్రాయం పైనే ఆధారపడి ఉంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. గతంలో ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ కూడా వార్నర్ ను ఈ విషయం పై అభిప్రాయం అడుగుతామని చెప్పుకొచ్చాడు.



 సాధారణంగా ఏ విషయంలో అయినా ఆచితూచి సమాధానాలు చెప్పే డేవిడ్ వార్నర్ ఈ విషయంలో మరింత జాగ్రత్త గా వ్యవహరిస్తున్నారు. గతంలో తాను క్రిస్ రోజర్స్ తో కలిసి ఓపెనర్లుగా బరిలోకి దిగానని ఆ తర్వాత జో బర్న్స్ తో  కలిసి ఓపెనింగ్ చేశానని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. దాదాపు 12 మంది ఆటగాళ్లు తనతో ఓపెనింగ్ భాగస్వామిగా బరిలోకి దిగారు అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్. ఎవరు కూడా నిలకడగా ఆడ లేకపోయారు.. ఓపెనింగ్ జోడి ఎవరితో  సౌకర్యంగా ఉంటుందని క్రికెట్ బోర్డు తన అభిప్రాయం అడుగుతుంది.. జో బర్న్స్  తనకు చాలా కాలంగా తెలుసు.. కానీ ఆ స్థానంలో  సరైన వ్యక్తిని తీసుకోవడం అనేది సెలక్టర్ల ఇష్టం . సెలక్టర్లు ఎవరిని  ఆడించిన తనకు సమ్మతమే అంటూ ఎంతో జాగ్రత్తగా సమాధానం చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: