
ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ విరాట్ కోహ్లీకి ఒక సలహా ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లకు అవకాశం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగాలి అంటూ సూచించాడు. లేదంటే మొదటికే మోసం వస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే వన్డే టీ20 ఫార్మాట్లో సెంచరీ చేసి నిరీక్షణకు తెరదించాడు విరాట్ కోహ్లీ. అయితే టెస్టుల్లో కూడా సెంచరీ చేయాల్సిన అవసరం ఉంది. 2019లో బంగ్లాదేశ్ పై చివరిసారి సెంచరీ చేశాడు. మళ్లీ టెస్ట్ సెంచరీ అందుకోలేకపోయాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి స్పిన్నర్ లను ఎదుర్కోవడంలో కోహ్లీ కాస్త తడబడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే స్పిన్నర్లను ఎదుర్కోవడం పై ఇర్ఫాన్ పఠాన్ అటు విరాట్ కోహ్లీకి సలహా ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లను డిఫెన్స్ మోడలో కాకుండా అటాకింగ్ మోడ్లో ఎదుర్కోవాలి అంటూ చెప్పాడు. ఇక ఇలా ఆస్ట్రేలియా స్పిన్నర్లను ఎదుర్కోవడం పై ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగాలి. ఎందుకంటే కోహ్లీ స్పిన్ లో తడబడుతున్నట్లు కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారమైతే లియోన్, అగర్ లపై ఎదురుదాడికి దిగడమే ఉత్తమం అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్.