జబర్దస్త్ కమెడియన్ గా కిరాక్ ఆర్పీ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. పలు సినిమాలలో కూడా కమెడియన్ గా నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు.. దీంతో జబర్దస్త్ లో కూడా మనస్పర్ధలు రావడంతో పూర్తిగా ఆ కార్యక్రమాలకు గుడ్ బై చెప్పేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక రెస్టారెంట్ నడుపుతూ భారీగానే సంపాదిస్తున్నారు. ఇటీవలే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది.. ముఖ్యంగా ఆయన పార్టీ గురించి కూడా కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా  మారాయి..


అయితే ఈ వ్యాఖ్యల పైన నటి శ్రీరెడ్డి స్పందిస్తూ దిమ్మతిరిగే సమాధానం తెలిపింది.. ఒరేయ్ ఆర్పీ.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని రెడ్ల పేరు పెట్టుకొని బిజినెస్ చేస్తున్నావ్  నీకెందుకురా ఈ పని నీ చేపల పులుసు పైన బోలెడు కంప్లైంట్స్ వచ్చాయి..చేపల పులుసు చండాలంగా ఉంటుందంటూ మీ యూట్యూబ్ ఛానల్ చూస్తే అర్థమవుతుందని తెలిపింది. వీడు భూమికి జానడు ఉండడు మాటలు చూస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్.. అసలు నీకి రాజకీయంగా ఎదగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని తిడితే ఫేమస్ అవుతావని ఎవరైనా చెప్పారా అంటూ ఫైర్ అయ్యింది..


ముందు నువ్వు ఎవరో తెలియదు కానీ రెడ్ల పేరు పెట్టుకొని నువ్వు బతుకుతున్నావు.. పెద్దారెడ్డి అనే పేరుతో చేపల పులుసు పెట్టుకొని ఇప్పుడు వారి పైన విమర్శలు చేస్తున్న నీకు పులుసు కారే సమయం దగ్గరపడింది రోయ్ అంటూ ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.. అసలు నీ బ్రతుకు ఎంత నువ్వెంత ఊకలో ఈకగాడివి అంటూ ఫైర్ అయ్యింది.. జగనన్న వల్ల ఎంతోమంది ఈ రోజున కడుపు నింపుకుంటున్నారో ఎంతోమంది ఉపాధికి లభించిందో తెలుసా అంటూ కిరాక్ ఆర్పీ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది శ్రీరెడ్డి. అందుకు సంబంధించి వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: