అయితే గర్భిణీ స్త్రీలు పాల ఉత్పత్తి పెంచేందుకు, కడుపు నొప్పి సమస్యల ఉపశమనంనకు కుంకుమ పువ్వు సహాయపడుతుంది. ఇక దీనిలో ఉండే యాంటీ స్పాస్మోడిక్ ప్రభావం కడుపు నొప్పిని నివారించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఇక గర్భవతి అయిన మహిళలకు 5 నెలల తర్వాత మాత్రమే కడుపులో పిల్లల యొక్క కదలికల అనుభూతి కలుగుతుంది. అందువలన 5 నెలల తర్వాత పాలు లేదా ఆహారంలో కేసర్ లేదా కుంకుమ పువ్వు వేసుకుంటే మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. గర్భిణి మహిళలు పెద్ద మొత్తంలో దీనిని వాడకూడదు. ఎందుకంటే దీని వలన అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ఇక స్త్రీలో రక్త పోటు మానసిక కల్లోలంను తగ్గించేందుకు పాలలో కుంకుమ పువ్వును 3 లేదా 4 రేకలు మాత్రమే తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అంతేకాక కండరాల ఉపశమనానికి ఇది చాలా మంచి వైద్యం. దీనిని పెద్ద మోతాదులో తీసుకుంటే గర్భాశయ ఉద్దీపనకు సహాయపడుతుంది. కేసరి అని పిలిచే కుంకుమ పువ్వు దృష్టి ఆరోగ్యానికి చాలా మంచిది. పరిశోధకులు గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వును తీసుకుంటే దృష్టికి సంబందించిన క్యాటరాక్ట్ దృష్టి మెరుగుదలలకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.