ప్రపంచంలో ఎన్నో చారిత్రక ఘోరాలు, నేరాలు జరిగాయి. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి కొన్ని నేరాలు బయటకు తెలుస్తున్నాయి కానీ అప్పట్లో పెద్ద స్థాయిలో ఉన్నవారు చేసే ఘోరమైన పనులు గురించి ఎవరికీ తెలిసేవి కావు. తెలిసిన కూడా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అలా ప్రపంచంలోనే క్రూరమైన నా ఓ మహిళ చేసిన పనులు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎలిజబెత్ బతోరి.. క్రూరత్వానికి ప్రతీక. హంగేరీ రాజ కుటుంబంలో జన్మించిన ఈమె చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. తన సేవకురాలు ఇచ్చిన కంప్లైంట్ తో అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

ఆమె చేసిన పనుల గురించి వింటే ఒక స్త్రీ ఇలా ఎలా ఆలోచించగలరు అని ఆశ్చర్యం వేస్తుంది. 1560 లో పుట్టిన బతోరీ తన 15వ ఏట పెళ్లి చేసుకొని సెజ్తే అనే కోటలోకి ప్రవేశించింది. నా కోట లో పనిచేసే సేవకులను, ఆ ప్రాంతంలోని రైతులను తక్కువ తరగతి వారిని విపరీతమైన టార్చర్ కు గురిచేసేది. అందమైన యువతులను చంపించి వారి రక్తంతో స్నానం చేసేది. తన అందం ఎప్పటికీ అలాగే ఉంటుంది అన్న నమ్మకంతో అలా చేసేదట. ఆమె అందమైన అమ్మాయిలకు బ్రతికి ఉండగానే నరకాన్ని చూపించేదట. అందమైన అమ్మాయి కింది భాగానికి తేనె పోసి చీమలను, తేనెటీగలను వదిలేశేదట. పిన్నిసులతో గోర్ల కింద గుచ్చేదట.

భర్త చనిపోయాక మరింతగా రెచ్చిపోయి బతోరి తన సేవకులను ఇష్టం ఉన్నట్లు కొరికేదట. ఒకసారి ఓ సేవకురాలిని మాంసాన్ని కోసి వండించి ఆమె తోటే తినిపించిందట. ప్రేమ కారణంగా ఆరువందల యాభై మందికి పైగా చనిపోయారు అని ఆరోపణలున్నాయి. అయితే న్యాయస్థానం ముందు ఇవేవీ నిర్ధారణ కాలేదు. కారణం ఆమె అత్యున్నత కుటుంబానికి చెందినామె కావడం. దీనికి తోడు ఆమె బంధువులే రాజ్యం చేయడం.

మరింత సమాచారం తెలుసుకోండి: