మండుతున్న ఎండలు కారణంగా చాలా మంది వాహనదారులు బైక్ లలో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు కారు కొనాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వారు తక్కువ బడ్జెట్ లో కారును కొనాలని అనుకుంటారు.కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన సంక్షోభం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. ఇప్పటికే ఆటో పరిశ్రమలో వాహనాల ధర అమాంతం పెరిగాయి. దీనికి తోడు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికి పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యులు వాహనాలు కొనుగోలు చేయాలంటేనే ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో మోటార్ సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ కారు కొనుగోలు చేయాలంటే మత్రం ధర చూసి ఆగుతున్నారు.


ఒకవేళ ధైర్యం చేసినా మైలేజీ విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ఈ రెండింటి బేరీజు వేసుకుని చూసుకుని మంచి ధరతో పాటు, అత్యుత్తమ మైలేజీనిచ్చే కార్ల కోసం చూస్తున్నారు.ఎటువంటి కారు కొనాలో అనే ఆలోచనలో ఉంటారు.అలాంటి వాళ్లు ఈ కార్లను ఒకసారి చూడండి.. అన్నీ కేవలం పది లక్షలలో లభిస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో దొరుకుతున్న అత్యుత్తమ మైలేజినిచ్చే పెట్రోల్ కార్లలో మారుతి సుజుకి సెలేరియో మోడల్ ముందు వరుసలో ఉంది. ఎస్-ప్రెసో, వాగన్-ఆర్ మోడళ్లలో ఉన్న ఇంజిన్ నే ఇందులోనూ ఉపయోగించారు. పవర్ ఔట్ పుట్ కూడా ఆ కార్లలో మాదిరేగానే ఉంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది


బీఎస్4 ఇంజిన్ ను కలిగి ఉన్నప్పుడు రెనాల్ట్ క్విడ్ అత్యధికంగా మైలేజినిచ్చే కారుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే బీఎస్6కు మారిన తర్వాత మైలేజి కొద్దిగా తగ్గింది. 800సీసీ 1.0-లీటర్ గ్యూస్ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ వాహనం లీటరుకు గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ సెడాన్ తో పోలిస్తే స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ వేరియంట్ కొంచెం లైట్ గా ఉన్నప్పటికీ మైలేజి విషయంలో మాత్రం వెనుకంజలో ఉంది. డిజైర్ మాదిరే సేమ్ ఇంజిన్ ను కలిగి ఉండి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ మైలేజీ వచ్చేసి లీటరుకు గరిష్ఠంగా 23.76 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఇవి కాకుండా మారుతీ సుజుకీ డిజైర్,డాట్సన్ రెడీ-గో,మారుతీ సుజుకీ వాగన్-ఆర్ కార్లు కూడా వరుసలో ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 లేదా 6 లక్షల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: