జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో ప్రభుత్వం అందించిన సాయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. వరదబాధితులు పెద్ద సంఖ్యలో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.

అయితే అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కి చేదు అనుభవం ఎదురైంది. వరద బాధితుల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించడానికి తన నియోజకవర్గ పరిధిలోని ఓ మీ సేవ కేంద్రానికి వెళ్లారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న బాధితులకు ఎమ్మెల్యేను చూడగానే ఒక్కసారిగా కోపానికి గురైయ్యారు. ఎమ్మెల్యేను చూసి తిట్ల పురాణం అందుకున్నారు బాధిత మహిళలు. వారిని  అడ్డుకునేందుకు యత్నించిన ఓ టీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తను ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఓ మహిళ. ఇక చేసేది ఏమీ లేక తన అనుచరులతో వెనుదిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌. కాగా, గ్రేటర్ ఎన్నికలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై టీఆర్ఎస్‌ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: