విజయవాడలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర‌మ‌వుతుండ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. కరోనా టెస్టుల్లో భాగంగా నిన్న ఒక్కరోజే ఊహించనన్ని పాజిటివ్ కేసులు నమోదు కావ‌డంతో అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నేటినుండి నగరంలోని 42 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించారు. అంతేగాకుండా.. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్, 144 సెక్షన్ కఠినంగా అమలుచేస్తామని అధికారులు చెప్పారు.

 

ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని సూచించారు. ప్ర‌తీ ఒక్క‌రు సామాజిక‌దూరం పాటించాల‌ని చెబుతున్నారు. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: