విజయవాడలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా టెస్టుల్లో భాగంగా నిన్న ఒక్కరోజే ఊహించనన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటినుండి నగరంలోని 42 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అంతేగాకుండా.. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్, 144 సెక్షన్ కఠినంగా అమలుచేస్తామని అధికారులు చెప్పారు.
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రతీ ఒక్కరు సామాజికదూరం పాటించాలని చెబుతున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.