చైనా ఆర్మీ భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. చైనా విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దు అని ఎదురు దాడులు చెయ్యాలి అని కేంద్రానికి పలువురు సూచనలు చేస్తున్నారు. ఇక తాజాగా దీనిపై తెలంగాణా సిఎం కేసీఆర్ కూడా స్పందించారు. 

 

దేశ రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దు అని అన్నారు. దేశం అంతటా ఒక్క తాటిపై ఉండాలి అన్నారు ఆయన. కేంద్రానికి దేశానికి తెలంగాణా ప్రజలు అండగా ఉంటారు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏ నిర్ణయం అయినా సరే వెనకడుగు వేయకుండా తీసుకోవాలి అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: