గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మొదలయింది. ప్రజలు అందరూ కూడా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి అని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. తాజాగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ... ఈ సారి ఓటింగ్ శాతం పెరిగేలా అన్ని ఏర్పాట్లు చేసాం అన్నారు. ఓటు వేస్తేనే ప్రశ్నిoచ గలరు అని పేర్కొన్నారు.

కరోనా జాగ్రత్తలతో పోలింగ్ జరుగుతోంది అన్నారు. అందరూ పోలింగ్‌ లో పాల్గొనండి అని సూచించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంత్రి కేటిఅర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్‌ లో ఓటు వేసిన కేటీఆర్ దంపతులు.. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు వేయనివారికి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలకు పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: