చెన్నై ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. నగదు సెల్ ఫోన్ కోసం కరోనా బాధితురాలిని ఆస్పత్రి సిబ్బంది హత్య చేశారు. పేషెంట్ భర్త తన భార్య కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వెతకగా హాస్పిటల్ వెనక కరోనా పేషెంట్ మృతదేహం లభ్యమైంది.

దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆసుపత్రిలో పనిచేస్తున్న రతీదేవి అనే మహిళలను అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్ నగదు కోసమే నిందితురాలు పేషెంట్ ను హత్య చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఘటనతో ఆస్పత్రిలోని పేషెంట్లు అంతా భయంతో వణికిపోతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: