వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘు రామపై తాజాగా ఫిర్యాదు చేసి షాకిచ్చారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెబల్ ఎంపీ రఘు రామ పక్కలో బల్లెంగా తయారైన విషయం తెలిసిందే. సొంత పార్టీకి చెందిన నేతలపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తూ ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘు రామపై ప్రధానితో పాటు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా రఘురామ కృష్ణరాజుకు సంబంధించిన హవాలా లావాదేవీల రుజువులు, ఇప్పటివరకూ సేకరించిన ఆధారాలను కూడా వారికి అందించారు. మరి ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని విషయం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. వైసీపీ ఎంపీల చర్యలపై రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: