ఒకప్పుడు రాజధాని కర్నూలు రాజధానిగా ఉండేది. గుంటూరులో హై కోర్టు ఉండేది. రాష్ట్రంలో పెద్ద నగరం
విశాఖ అని,
విశాఖ ప్రాంతంలో తనకు ఇల్లు కూడా ఉందని చెప్పారు.
విశాఖ ను అభివృద్ధి చేస్తే పదేళ్లకు హైదరాబాద్ పోటీ పడుతుంది. డబ్బులు లేని పరిస్థితిలో ఇలాంటిది సాధ్యమేనా.? రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేవిధంగా సిద్ధం అవుతాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోడ్లు బాగుచేసే పరిస్థితి లేదని సీఎం జగన్ చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన చేశాం. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం అవుతాయని వెల్లడి అయింది. మళ్లీ సమ్రగైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో వస్తాం.
రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా.. రాజధానులు చేసి ఉంటే ఈ పాటికి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉండేది. వెనుకబడ్డ ప్రాంతాలు కూడా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కేంద్రీకరణ దోరణులు ఒక చోటే పూర్తిగా కేంద్రీకరణ దోరణులు ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా వెల్లడి అయింది. హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని ప్రజల తీర్పు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్నిమతాలు, అందరి ఆశలు, ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తుందని అందుకే ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారు.