ఇటీవలి కాలంలో మహిళల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఇక ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి అఘాయిత్యాలకు పాల్పడెందుకు కాచుకుని కూర్చున్న కామాంధులు ఎక్కడబడితే అక్కడే కనిపిస్తూ ఉన్నారు. దీంతో ఆడపిల్ల నేటి రోజుల్లో ధైర్యంగా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. అయితే ఆడపిల్ల అర్ధరాత్రి నడిరోడ్డుపై ధైర్యంగా తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీ గారు చెప్పారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఇంకా దేశంలో ఆడపిల్లకు స్వాతంత్ర్యం రాలేదు అన్నది మాత్రం అర్థమవుతోంది.


 ఇక రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తున్నాయ్ అని చెప్పాలి. గుడి, బడి, బస్టాండ్ రైల్వే స్టేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఎక్కడ సేఫ్టీ లేకుండా పోయింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్  లోని గోండా లో నవాబ్ గంజ్ లో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలన గా మారింది. స్థానికంగా ఉండే 22 ఏళ్ల యువతి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేస్తుంది. ఇక ఆమె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు జిమ్ కు వెళుతూ ఉండేది.


 ఇక అక్కడ జిమ్ లో ఆమెకు వర్కౌట్స్ నేర్పించే జిమ్ ట్రైనర్ యువతి పై కన్నేశాడు. ఎలాగైనా ఆ యువతిని లొంగదీసుకొని కోరిక తీర్చుకోవాలి అని భావించాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి కోరిక తీర్చాలి అంటూ సదరు యువతిని వేధించడం మొదలుపెట్టాడు. సదరు యువతి మాత్రం అతని అవాయిడ్ చేసింది.. అయితే యువతి మార్కెట్ కు వెళ్ళిన సమయంలో అక్కడి కాపు కాచుకుని ఉన్న సదరు కామాంధుడు సుమో వాహనాన్ని తీసుకొచ్చి యువతి ముందు ఆపాడు. వెంటనే ఆమెను బలవంతంగా సుమో లోకి ఎక్కించి వెళ్ళిపోయాడు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ కి గురయ్యారు.ఇక స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆ యువతి ఆచూకీ కనుగొని పనిలో ఉన్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: