ఇటీవల కాలంలో ప్రేమ అనేది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే  ఒకప్పుడు ఏకంగా ప్రేమించిన వారు సంతోషంగా ఉంటారు అని భావిస్తే ఏకంగా ప్రేమను సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడేవారు ప్రేమికులు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా ప్రేమించిన వారిని మోసం చేస్తూ వేరొకరితో చెట్ట పట్టాలేసుకొని తిరుగుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఇలా ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతూ ఇక ప్రేమించిన వారిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు కూడా సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.


 ఇక మరికొన్ని ఘటనల్లో ఏకంగా ప్రేమించిన వారు మోసం చేశారు అన్న కారణంతో మనస్థాపం చెంది ఇక కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు కూడా రోజురోజుకు ఎక్కువ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా ఎంతోమంది యువత తీసుకుంటున్న నిర్ణయాలు చివరికి తల్లిదండ్రులకు అరణ్య రోధనను మిగులుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగు చూసింది. తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి జరుగుతుంది అన్న విషయాన్ని అతను అస్సలు జీర్ణించుకోలేకపోయాడు.


 ఈ క్రమంలోనే ప్రియురాలి లేని జీవితం ఇక వృధా అని భావించాడు. దీంతో క్షణికావేశంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా ప్రియురాలు దూరమైంది అనే బాధలో ఒక మైనర్ బాలుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన రాజస్థాన్లోని బిల్వారాలో వెలుగు చూసింది. మృతుడు యష్ వాస్ గా గుర్తించారు పోలీసులు. ఘటన జరిగిన కొద్ది సేపటికే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. ఇక కొడుకు పెద్దయ్ ప్రయోజకుడు అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక అరణ్య రోదనగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: