మహిళలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కామాంధుల చేతిలో బలి అవుతున్నారు. దిశ లాంటి అమాయికులు ప్రాణాలును పోగొట్టుకున్నారు.. అయిన కూడా సమాజంలో ఎటువంటి మార్పు రాలేదు..ఏదొక రకంగా లైంగిక దాడులు చెస్తున్నారు.. ఇప్పుడు ఓ బాధాకరమైన ఘటన వెలుగు లోకి వచ్చింది. మైనర్ బాలిక ఓ కామంధుడు లైంగిక దాడి చేసాడు. అలా బెదిరించి రోజూ చేస్తూ వచ్చాడు. ఒక రోజు ఒంటి పై పంటి గాట్లు ఉండటం గమనించిన తల్లి ఆరా తీయడం తో అసలు విషయం బయట పడింది.


వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన జహీరాబాద్‌ లో వెలుగు చూసింది. అక్కడ  మహ్మద్‌ మోహిజ్‌ అనే 20 ఏళ్ల వ్యక్తి ఎమ్‌ఎస్‌ మక్తాలో నివాసం ఉండే తన సోదరి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఉంటూ వెల్డింగ్ పని చేస్తున్నాడు. అయితే, ఇతను అద్దెకు ఉండే పోర్షన్ పక్కనే మరో కుటుంబం కూడా నివసిస్తున్నారు.. వారికి 13 ఏళ్ళ కూతురు వుంది. అతని కన్ను బాలికపై పడింది. ఆమెను ఎలాగైనా లొంగతీసుకొవాలని పక్కా ప్లాన్ వేసాడు..


దాంతో అమ్మాయికి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టాడు.. ఆమెకు కావలసిన చాక్లెట్లు, మొదలగునవి కొనిచ్చాడు.. అలా పరిచయం పెంచుకున్నారు.. అదే అదునుగా చూసి.. ఆమె పై లైంగిక వేధింపులకు దిగాడు. మంగళవారం బాలిక ఒంటి పై పంటిగాట్లు ఉన్న విషయం కుటుంబ సభ్యులు గమనించారు. ఆమెను నిలదీయగా.. మహ్మద్‌ మోహిజ్‌ రోజూ తన పై అత్యాచారం చేస్తున్నాడని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి అదుపు లోకి తీసుకున్నారు. బాలికను ఆసుపత్రి కి తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు జరిపారు. అలాగే ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన పడవలసిన అవసరంలేదని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: