ఎందుకంటే సాధారణంగా ముసలి వాళ్లు అయిన తర్వాత అనారోగ్యంతో మరణించడం జరుగుతూ ఉంటుంది. కానీ అభం శుభం తెలియని చిన్నారులు సైతం కొన్ని కొన్ని సార్లు ఊహించని ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. సరదాగా ఆడుకుంటూ తెలిసి తెలియక చేసిన పనులే చివరికి చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఫ్యాన్ కు కట్టి ఉన్న ఒక క్లాత్ ముక్కతో ఆడుకుంటున్నాడు 13 ఏళ్ల బాలుడు. కానీ చివరికి అదే అతనికి ఉరితాడుగా మారుతుందని మాత్రం ఊహించలేదు.
ఇక అనుకోకుండా ఆ గుడ్డ ముక్క బాలుడి గొంతుకు బిగుసుకుపోయి అతను ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో వెలుగు చూసింది. కోషేర్ నర్గీస్ అనే దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో కుమారుడు 13 ఏళ్ల నజీర్ ఫ్యాన్ కు వేలాడుతున్న క్లాత్ ముక్కతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక తల్లిదండ్రులు కూడా చూసి చూడనట్లుగానే ఉన్నారు. అయితే అంతలోనే విధి ఆ పిల్లాడి విషయంలో కన్ను కుట్టింది. దీంతో ఇక క్లాత్ ముక్కలో అతని మెడ ఇరుక్కుపోయింది. దీంతో అది బిగుసుకుపోయి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కాసేపటికి తల్లి వచ్చి గమనించగా అప్పటికే బాలుడు విగత జీవిగా మారాడు. దీంతో తల్లి బోరున విలపించింది.