ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, కృష్ణా జిల్లా లతో పాటు సీఆర్డీఏ రీజియన్లలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల ద్వారా కొంత వరకు నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పుకొచ్చారు
కామర్స్ సేల్స్ ఆఫీసర్ విభాగంలో ఈ 200 పోస్టులను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకు పెద్దగా చదువు అవసరం లేదు. కేవలం ఇంటర్ లో అర్హత సాధించి ఉండాలని అధికారులు వెల్లడించారు.ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు దారుల వయస్సు 22-30 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు 2 వీలర్ తో పాటు, స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13, 500 వేతనంతో పాటు పని తీరు ఆధారంగా రూ. 6 వేల వరకు ఇన్సెంటీవ్స్ ఇస్తారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి