మనకు పల్లెల్లో దొరికే తాటికల్లును తాగడం మంచిదేనా… దీనిని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి మేలు కలుగుతుందా.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇక తాటి చెట్టు నుండి వచ్చిన ద్రావణాన్ని నీరా అని అంటారు. ఈ నీరా చాలా రుచిగా ఉంటుంది.అయితే నీరాను మాత్రం ఖచ్చితంగా తాటిచెట్టు నుండి సేకరించిన 3 నుండి 4 గంటల లోపు తీసుకోవాలి. ఒక 100 ఎమ్ ఎల్ నీరాలో 75 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ రూపంలో ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ సుక్రోజ్ రూపంలో ఉంటాయి కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు దీనిని తాగినప్పటికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.ఈ నీరాను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నీరాను చెట్టు నుండి తీసిన 12 గంటల లోపు మాత్రమే తీసుకోవాలి.ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మత్తు లేకుండా ఉంటుంది. ఇక సమయం గడిచే కొద్ది నీరా పులిసి కల్లుగా మారుతుంది. ఇంకా అలాగే ఈ కల్లు పులిసే కొద్ది దీనిలో ఉండే ఈస్ట్ కారణంగా ఆల్కహాల్ శాతం కూడా పెరుగుతుంది.


ఈ కల్లులో 4 నుండి 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అలాగే చాలా మంది కూడా ఈ కల్లు మరీ ఎక్కువగా పులవకుండా ఉండడానికి దానిలో క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు. ఇంకా అలాగే కొందరు కల్లుల్లో ఆల్కహాల్ శాతం పెరగడానికి ఈస్ట్ ను, పంచదారను కూడా కలుపుతారు. అందువల్ల ఈస్ట్ కల్లును పులియబెట్టి ఆల్కహాల్ శాతాన్ని పెంచుతుంది.ఇలా పులిసిన కల్లును తాగడం వల్ల ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల కలిగే చెడు ప్రభావం కలుగుతుంది. అందుకే పులిసన కల్లును తాగడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.కాలేయ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పులిన కల్లు మత్తును ఇస్తుందని చాలా మంది దీనిని తాగడానికే ఎక్కువ అలవాటు పడతారు. కానీ పులిసిన కల్లును తాగడం వల్ల మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాటి చెట్టు నుండి తీసిన నీరాను తాగినప్పుడే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: