
ఇక ఏదైనా కారణం వల్ల కార్మికుడు మృతి చెందితే అతని కుటుంబానికి రెండు లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ముఖ్యంగా కార్డుదారుడు ప్రమాదానికి గురై వికలాంగులు అయితే లక్ష రూపాయల సహాయం లభిస్తుంది. ఇకపోతే ఈ శ్రమ్ కార్డు పథకం కింద ప్రభుత్వం నమోదు చేసుకున్న కార్మికులకు ఉచిత కుట్టుమిషన్లు, పిల్లలకు స్కాలర్షిప్లు , ఉచిత సైకిళ్ళు మొదలైనవి కూడా అందిస్తుంది. అంతేకాదు కార్మికులు ఇల్లు నిర్మించుకోవడానికి సులభంగా రుణం కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్న ఈ శ్రమ్ కార్డును ఉపయోగించి రుణం తీసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడింది .
ఇక ఇందుకోసం కావలసిన ధృవీకరణ పత్రాలు ఏమి అని అంటే.. ఆధార్ కార్డు , ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబరు , ఐఎఫ్ఎస్సి కోడ్ , బ్యాంక్ అకౌంట్ నెంబర్ , ఆదాయపు దృవీకరణ పత్రము, చిరునామా పత్రము, పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. e-shram / eshram.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.