నేచురల్ స్టార్ నాని.. ఇంకాస్త మసాలా అంటూ ‘బిగ్ బాస్ సీజన్ 2’తో సందడి చేస్తున్నారు. ప్రతిరోజు స్టార్ మా లో ప్రసారం అవుతున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ ఇప్పటికే 38 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు.  బిగ్ బాస్ హౌజ్ నుంచి మొదట కామన్ మాన్ గా వచ్చిన సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు.  అయితే బిగ్ బాస్ లో కామన్ మాన్ గా వచ్చిన వారిపై వివక్ష కొనసాగుతుందని రూమర్లు వచ్చాయి. 
గణేష్ గుడ్డుకొట్టిన అమిత్
ఆ తర్వాత నటుడు కిరీటి, యాంకర్ శ్యామల, భానుశ్రీ ఎలిమినేట్ అయ్యారు.  ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో దీప్తి నల్లమోతు, రోల్ రైడా, సమ్రాట్ రెడ్డి, తనీష్ అల్లాడి, తేజస్వి మదివాడలు ఉండటంతో బిగ్ బాస్ హౌస్‌ను వీడే సెలబ్రిటీ ఎవరన్నది ఆసక్తిగా మారింది.  గతంలో బిగ్ బాస్ సీజన్ వన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నవదీప్, దీక్షాపంత్‌లు ఎంట్రీ ఇచ్చారు.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నటి హెబ్బా పటేల్ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి.
i am in my house, not in bigg boss house says hebah patel
ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి హెబ్బా పటేల్ స్పందించింది. "నేను మా ఇంట్లోనే వున్నా .. మరే ఇంట్లో లేను .. ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇలా 'బిగ్ బాస్ హౌస్'లోకి తాను ఎంట్రీ ఇస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసింది.  అయితే బిగ్ బాస్ లోకి హెబ్బా ఎంట్రీ ఇస్తే మరింత జోష్ పెరుగుతుందని భావించారు ఆడియన్స్..కానీ అంతలోనే అదంతా ఫేక్ అని తెలియడంతో ఢీలా పడిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: