టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా పవన్ కళ్యాణ్ పై అప్పట్లో కామెంట్లు చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అప్పట్లో పూనమ్ పవన్ పై నెగిటివ్ కామెంట్లు చేసేది. అయితే పూనమ్ ఇన్డైరెక్ట్ గా పవన్ ఉద్దేశించి కామెంట్స్ చేసేది. ఓ అబద్ధాల కోరు ఎన్నటికీ రాజకీయనాయకుడు కాలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ తరవాత కొంతకాలానికి ఆమె తన రూట్ మార్చుకుంది. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వల్లే తాను పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశానని తెలిపింది. అంతే కాకుండా వర్మ పెద్ద జాదూ అని..తాను చెప్పింది వినకపోతే అమ్మాయిల సీక్రెట్స్ తెలుసుకుని వారి సీక్రెట్స్ బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తారని పేర్కొంది. అంతే కాకుండా ఆర్జీవి తనకు ఫోన్ చేసి గంటపాటు పవన్ పై కామెంట్స్ చేయాలని బ్లాక్ మెయిల్ చేసేవారని తెలిపింది. అందుకే తాను అలా మాట్లాడవలసి వచ్చిందని చెప్పింది.

ఆ తరవాత నుండి మాత్రం పవన్ పై పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తుంది పూనమ్ కౌర్. ఇక శుక్రవారం విడుదలైన వకీల్ సాబ్ సినిమాపైనా పూనమ్ స్పందించింది. వకీల్ సాబ్ సినిమాకు పూర్తిగా పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్విట్టర్ లో మాత్రం ఒక వర్గానికి చెందినవారు పని కట్టుకుని నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు. అంతే కాకుండా ట్విట్టర్ ట్రెండ్ లోకి తీసుకువచ్చారు. ఇదే అంశం పై స్పందించిన పూనమ్...మంచి సినిమాకు ఎవరైనా సపోర్ట్ చేయాలని తెలిపింది. కానీ కొంతమంది సినిమాను తక్కువ చేస్తూ ట్రెండ్ చేయడం ఎంతో అర్థం కావడం లేదని పేర్కొంది. ఇప్పుడు కుళ్లు రాజకీయాలు చేస్తున్నది ఎవరని ప్రశ్నించింది. అమ్మాయిలను తక్కువ చేసి రాజకీయం చేస్తే తప్పుకాదు..కానీ అమ్మాయిలను రక్షించే సినిమా చేస్తే ఎవరికి ప్రాబ్లమ్ అంటూ పేర్కొంది.  చివర్లో ప్రెస్ మీట్ పోసాని గారూ అంటూ పూనమ్ రాసుకొచ్చింది.








మరింత సమాచారం తెలుసుకోండి: