చిత్ర పరిశ్రమలోకి బాల నటుడిగా తేజ ఎన్నో సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. తేజు హీరోగా మారడానికి చాలా కష్టపడుతున్నారు. ఇక జాంబీ రెడ్డి లాంటి వినూత్న సినిమాతో హీరోగా కూడా సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం తేజ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు.

అయితే జాంబీ రెడ్డి సినిమాకి రేటింగ్స్ తక్కువగానే వచ్చినప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం జాంబీ రెడ్డిని బాగా చూస్తున్నారు. ఇక ఆ కారణంగా ఎవరూ ఊహించని విధంగా జాంబీ రెడ్డి మంచి ప్రాఫిట్స్ నే అందుకోవడంతో పాటు రీమేక్ రైట్స్ పరంగా కూడా బాగా క్యాష్ చేసుకుంది అని చెప్పాలి. అంతేకాదు.. మరో  ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి.. శరవేగంగా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి షూట్ కి అసలు గ్యాప్ కూడా ఇవ్వడం లేదంట

ఇక ప్రశాంత్ వర్మ ఈసారి మరో భిన్నమైన కథాంశంతో ఇప్పుడు చేస్తోన్న సినిమా స్టోరీని రాశారంట. ఈ సినిమాకి టైటిల్ హనుమాన్ అని కొత్తగా పెట్టారు. అయితే క్రేజీ స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హై బడ్జెట్ ను కేటాయించడం కూడా నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా ‘జాంబీ రెడ్డి’ సాధించిన లాభాలు, బాగానే పని చేస్తున్నారు.అంతేకాదు.. తేజ సజ్జ కోసం కూడా కొత్త డైరెక్టర్లు ఎదురుచుస్తున్నారు.

తేజ సజ్జతో సితార లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే చిన్నాచితకా నిర్మాణ సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది ? మొత్తమ్మీద తేజకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. ఇక అందుకు తగ్గట్టుగానే తేజ సజ్జ కూడా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచారు. అయితే జాంబీ రెడ్డికి ముందు వరకూ లక్షల్లో ఉన్న తేజ పారితోషికం తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు దాటిందని టాక్ వినిపిస్తుంది. తేజ ఇలా సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతే, అసలుకే మోసం వచ్చే పరిస్థితి  వస్తుంది. తేజు తన రెమ్యునరేషన్ విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని అంటున్నారు సినీ ప్రముఖులు.



మరింత సమాచారం తెలుసుకోండి: