యువ దర్శకుడు పరశురామ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి వర్క్ చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా మహానటి భామ కీర్తి సురేష్మూవీ ద్వారా తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడీగా నటిస్తోంది. ఇక ఈ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

కోలీవుడ్ నటుడు సముద్రఖని విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఒక కీలక పాత్రలో కనిపించనుండగా దీనిని ఇటీవల బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు ఫ్రాడ్స్ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారట. అయితే ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించిందని, త్వరలో దీనిపై అఫీషియల్ గా స్టేట్మెంట్ కూడా రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుగుతుండగా తదుపరి యూనిట్, విశాఖపట్నం తో పాటు ఆపైన స్పెయిన్ కూడా వెళ్లనుందట.

కాగా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగినప్పటి నుండి ఇప్పటివరకు కూడా హీరో మహేష్ బాబు ఈ మూవీ షూటింగ్ విషయమై ఎంతో పక్కాగా శ్రద్ధ తీసుకుని ఎక్కడా కూడా గ్యాప్స్ రాకుండా చూస్తున్నారని, అలానే వేగంగా వీలైనంత త్వరలో ఈ సర్కారు వారి పాట ని పూర్తి చేసేలా ఆయన ఇప్పటికే దర్శకనిర్మాతలకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. విషయం ఏమిటంటే, ఇటీవల కరోనా కారణంగా ఎన్నో నెలల పాటు షూటింగ్ వాయిదా పడ్డ ఈ సినిమాని మరొక్కసారి అడ్డంకులు రానివ్వకుండా, వేగంగా పూర్తి చేయాలి అనేది మహేష్ ఆలోచన అని అంటున్నారు. కాగా దీని తరువాత త్రివిక్రమ్ తో మహేష్ తన నెక్స్ట్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: