నాచురల్ స్టార్ నాని వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఆయనకు హిట్ ఇచ్చి మళ్లీ నాని ఫామ్లోకి వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అవి తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే చిత్రం చేస్తున్న నాని అదే సమయంలో దసరా అనే చిత్రాన్ని కూడా చేస్తుండడం విశేషం. ఒకేసారి ఈ రెండు సినిమాలను చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న నాని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అవతరించడానికి సిద్ధమవుతున్నాడు. 

ఇప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలు అందరూ కూడా ఈ తరహా సినిమాల్లో చేసే విధంగా ప్రణాళిక లు రూపొందించుకున్నారు. ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో నాని ఎందుకు పాన్ ఇండియా సినిమా చేయడం లేదు అని ఆయన అభిమానులు ప్రశ్నించారు. రోజురోజుకూ తనపై ఆ రకమైన ఒత్తిడి పెరిగి పోవడంతో తాను కూడా ఆ సినిమా చేసే విధంగా ఇప్పుడు ముందుకు వెళుతున్నాడు. అయితే మల్టీస్టారర్ సినిమా చేసి దానితో పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ కావాలి అనేది నాని ఆలోచనగా తెలుస్తోంది. 

అలా ఆ ఆలోచన వచ్చిందో లేదో వెంటనే కొంతమంది దర్శకులను ఆ విధమైన కథ తయారు చేయమని చెప్పాడట. అయితే పాన్ ఇండియా సినిమా కాబట్టి తమిళ హీరో ను కలుపుకుని ఈ సినిమా చేయాలని నాని భావించగా దానికి విశాల్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తొందరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. విశాల్ కు ఇటు తెలుగులోనూ తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదల అవుతూ సూపర్ హిట్ కొడుతూ భారీ స్థాయిలో ఆయనకు ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ పాన్ ఇండియా సినిమా చేయవలసిన అవసరం ఉండడం తో ఇప్పుడు వీరు చేయబోయే ఈ సినిమా వారికి ఎలాంటి విజయాన్ని తీసుకు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: