యంగ్ టైగర్
ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్
సినిమా ద్వారా సంచలన విజయాన్ని అందుకొని పాన్
ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పుడు పాన్
ఇండియా స్థాయిలో తన స్టార్ డమ్ ను కొనసాగించుకునే విధంగా వరుస సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న
కొరటాల శివ సినిమా పై పూర్తి శ్రద్ధ వహించాడు. ఆచార్య
సినిమా తర్వాత అయినా
కొరటాల శివతో కలిసి ఆయన ఇప్పుడు చేస్తున్న
సినిమా పెద్ద రిస్క్ అని చెప్పాలి.
అభిమానులు ఎంత చెబుతున్నా కూడా
కొరటాల శివ పై నమ్మకం ఉంచిన
ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు గతంలో జనతా గ్యారేజ్
సినిమా రాగా ఇప్పుడు ఈ
సినిమా కూడా అంతకు మించిన విజయాన్ని అందుకుంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో ఈ
సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం యొక్క డైలాగ్ మోషన్
పోస్టర్ విడుదల కాగా అది చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలను పెంచింది. ఈ
సినిమా ను పాన్
ఇండియా వైడ్ గా విడుదల చేయబోతున్నామని క్లారిటీ చిత్రబృందం మొదట్లోనే ఇచ్చింది.
ఏకంగా అయిదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో
కేజిఎఫ్ దర్శకుడైన
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఓ భారీ సినిమాను కూడా ప్రకటించాడు ఎన్టీఆర్. ఆ విధంగా రెండు భారీ చిత్రాలను ఒకేసారి ప్రకటించిన
ఎన్టీఆర్ ఈ రెండు చిత్రాలతో మాత్రమే ఆగిపోకుండా మరొక సినిమాని కూడా లైన్లో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. తమిళనాట మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేట్రి మారన్ ఓ లైన్ వినిపించాడట. ఈ కథకు కూడా ఓకే చెప్పేశాడట.
ఎన్టీఆర్ చేస్తున్న ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత తన చిత్రాన్ని మొదలుపెట్టాలని జాతీయ అవార్డు
విన్నర్ వెట్రి భావిస్తున్నాడు.