మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితమే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం  భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు ఆయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం  మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ను చిత్ర బృందం ఎప్పుడూ కూడా పెద్ద గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్ లను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ చాలా షెడ్యూల్ ల షూటింగ్ లను పూర్తి చేసుకుంది. జూలై 23 లేదా 24 వ తేదీ లలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో  షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర బృందం ఏపీ లోని కొన్ని ప్రదేశాలలో షూటింగ్ లను నిర్వహించాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా వైజాగ్ సహా కాకినాడ రాజమండ్రి, కర్నూల్ మరియు ఏలూరు ప్రాంతాల్లో తదుపరి షెడ్యూల్ షూటింగ్ లకు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా శంకర్, రామ్ చరణ్ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో వరుస షెడ్యూల్  లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: