కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దళపతి విజయ్ ఈ సంవత్సరం ఇప్పటికే బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. బీస్ట్ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందింది. ఈ పాన్ ఇండియా మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల అయిన బీస్ట్ మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ క్రేజీ హీరో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న వరిసు అనే తమిళ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు.

రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి రంజితమే అనే సాంగ్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ థియేటర్ హక్కులను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అమ్మి వేసింది. తాజాగా విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరిసు మూవీ తమిళ థియేట్రికల్ హక్కులను 7 స్క్రీన్ స్టూడియో సంస్థ దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: