చిరంజీవి ఇంట్లో ప్రతి పండుగను చాల ఆనందంగా జరుపుకోవడం ఒక సాంప్రదాయం. క్రిస్మస్ వేడుకలు కూడ చిరంజీవి ఇంట్లో చాల ఘనంగా జరుగుతాయి. క్రిస్మస్ రాకుండానే మెగా ఫ్యామిలీకి చెందిన అందరు చిరంజీవి ఇంట్లో ఒక గేట్ టు గెదర్ గా కలిసి ఒకరికొకరు క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఆరోజు అంతా చాల ఆనందంగా గడుపుతూ ఉంటారు.


అయితే ఇలా వీరంతా ఒకరికొకరు ఇచ్చుకునే గిఫ్ట్స్ చాల క్యూట్ గా దేనికి దానికి డిఫరెంట్ గా మరీ ఖరీదైనవి కాకుండా అనుకున్న ఒకే ధరలో ఉండాలి. దీనితో మెగా ఫ్యామిలీ మెంబర్స్ క్రిస్మస్ రాకుండానే ఇలాంటి వెరైటీ గిఫ్ట్స్ కొనే విషయంలో చాల బిజీగా ఉంటూ వారు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడ ఇలాంటి గిఫ్ట్స్ కోసం మెగా ఫ్యామిలీ మెంబర్స్ అన్వేషణ సాగిస్తూ ఉంటారట.  


లేటెస్ట్ గా చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ క్రిస్మస్ వేడుకలకు అల్లు అర్జున్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ నిహారిక లతో పాటు చిరంజీవి కూతుళ్ళు మెగా ఫ్యామిలీకి చెందిన కజిన్స్ అందరూ రావడమే కాకుండా వారంతా చాల సరదాగా క్రిస్మస్ ఈవెంట్ ను చాల ఆనందంగా జరుపుకున్నట్లు ఉపాసన తన ఇన్ ష్టా గ్రామ్ ఎకౌంట్ లో ఆవివరాలతో పాటు ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను కూడ షేర్ చేసింది.


ప్రతిసంవత్సరం ఇలా మెగా కుటుంబ సభ్యులు కలిసి క్రిస్మస్ ఈవెంట్ ను జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ ఈసారి వేడుకలకు మాత్రం ఒక ప్రత్యేకత ఏర్పడింది. చరణ్ ఉపాసనలు తల్లితండ్రులు కాబోతున్న నేపద్యంలో ఈ ఈవెంట్ కు వచ్చిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చరణ్ ఉపాసనల తో చాల ఉల్లాసంగా ఆవేడుక జరుపుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ అల్లు అర్జున్ ల మధ్య చిన్న గ్యాప్ ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో బన్నీ చరణ్ తో కలిసి ఈ ఈవెంట్ లో ఆనందంగా పాల్గొన్న ఈ ఫోటోలను చూసిన వారికి వారిద్దరి సాన్నిహిత్యం మరొకసారి తెలియచేస్తుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: