నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం క్రాక్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించింది.

ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఏబీఎన్ కాలేజీ గ్రౌండ్స్ ఒంగోలులో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన మరో అప్డేట్ ను ప్రకటించింది. 

తాజాగా ఈ మూవీ యూనిట్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏబీఎన్ కాలేజీ గ్రౌండ్స్ ఒంగోలులో కాకుండా ... అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్ ... ఒంగోలు లో నిర్వహించనున్నట్లు ... ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: