త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురం లో సినిమా  సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున విడుదలవుతుందని పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు సినిమా యూనిట్. ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా విడుదల అవుతుందని ప్రకటించడంతో రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం అప్పట్లో సృష్టించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు కావాలని ఒకే రోజు సినిమా విడుదల చేస్తున్నారని ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని ఇలాంటి వాతావరణం ఇండస్ట్రీలో ఉంటే మంచిది కాదని ఈ రెండు సినిమాలు విడుదల అవుతున్న తేదీల సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మరియు ట్రేడ్ వర్గాల పండితులు కామెంట్లు చేయటంతో అల్లు అర్జున్ వస్తున్న వ్యాఖ్యలు విని షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్.


ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో మంచి వాతావరణం క్రియేట్ అయ్యేవిధంగా తనవల్ల హీరోల అభిమానుల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అని భావించి అల్లు అర్జున్ ఈ సినిమాని సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల అవుతున్న రోజు కాకుండా అనగా జనవరి 12వ తారీకున కాకుండా మరుసటి రోజు విడుదల చేయాలనే ఆలోచనలో నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. ఇందుమూలంగా నే మలయాళం పోస్టర్లో సినిమా విడుదల తేదీ ప్రకటించకుండా అల్లుఅర్జున్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


మరోపక్క మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 12వ తారీకున కాకుండా ముందే విడుదల చేయాలని భావిస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. దీంతో వీరిద్దరు హీరోల అభిమానులు సినిమా రిలీజ్ తేదీలు మారుతున్నాయని వార్తలు రావడంతో చాలా కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: