ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ టాలీవుడ్పై సైతం పడింది. ఇప్పటికే హైదరాబాద్లో కరోనా అనుమానితుల కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఈ వైరస్ ఎఫెక్ట్ టాలీవుడ్నూ కూడా వణికిస్తోంది. ఇప్పటికే స్టార్ హీరో ప్రభాస్ ముఖానికి మాస్క్ ధరించి విమానాశ్రయంలో కనిపించారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభాస్ ఇప్పటికే చూపించేశారు. ఇక స్టార్ హీరోల్లో కరోనాపై ముందుగా స్పందించారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని... ముందు జాగ్రత్త చర్యలు మనలను సేవ్ చేస్తాయని ఆయన సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు.
ఇక కరోనా ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ? చర్చించేందుకు గురువారం సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ ఫిల్మ్నగర్లో గల తెలుగు ఫిల్మ్చాంబర్లో ఇండస్ట్రీ పెద్దతు సమావేశమవుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఇక కరోనా ప్రభావం వల్ల కొందరు స్థానికంగా షూటింగ్లు బంద్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి కొందరు ఇక్కడ షూటింగ్లు ఆపేసి.. విదేశాల్లో షూటింగ్లు పెట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
మరి కొందరు నిర్మాతలు విదేశాల్లోనూ కరోనా ఎఫెక్ట్ ఎక్కువుగా ఉండడంతో కొద్ది రోజుల వరకు షూటింగ్ లు బంద్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరికొందరు విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక షూటింగ్లు ఆగితే... కొద్ది రోజులు థియేటర్లు కూడా బంద్ అవుతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో ప్రజలు కిక్కిరిసి పోతారు. అక్కడ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉండడంతో ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటారో ? అన్నది చూడాలి.
ఒక వేళ సినిమా షూటింగ్లు ఆలస్యమై.. రిలీజ్ లు వాయిదా పడి... థియేటర్లు కొన్ని రోజుల పాటు మూతపడితే ఇండస్ట్రీకి వచ్చే నష్టం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కరోనా ఎఫెక్ట్ చివరకు టాలీవుడ్ను కూడా చిక్కుల్లో పడేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి