నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కి మూడు నాలుగు హిట్ సినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు. కానీ ఎప్పడయితే మహానటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం 'మహానటి' చేసిందో ఆ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో కీర్తి నటనకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా లభించింది. అయితే ఈ సినిమా తరువాత ఇలాంటి పాత్రలే వస్తుంటే అవన్నీ చేయలేనని చెప్పి షాకిచ్చిన ఆమె మళ్ళీ రెగ్యులర్ ఫార్మాట్ లోకి వచ్చి సినిమాలు చేయాలని అనుకుంది.

అయితే ఎక్కువగా ఆమెకు లేడీ ఓరిఎంటెడ్ కధలే వస్తున్నాయి. అలాంటి కధలు రెండు మూడు ఒప్పుకుంది కూడా. అందులో ఇప్పటికే పెంగ్విన్ సినిమా రిలీజ్ కాగా, మిస్ ఇండియా, మరో స్పోర్ట్స్ బేస్డ్ మూవీ షూట్ లో ఉన్నాయి. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా తనను ఖుషీ చేసిన ఫ్యాన్స్ ని హ్యాపీ చేసేపనిలో పడింది కీర్తి. మొన్న తనకు విష్ చేసిన అందరికీ ట్విట్టర్ లో రిప్లై ఇచ్చే పనిలో పడింది ఆమె.

మొన్నటి నుండి వారందరికీ రిప్లై ఇస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం ఆమె ఇటలీ వెళ్ళే పనిలో ఉంది. ఆమె నటిస్తోన్న రంగ్ దే సినిమా షూట్ అక్కడ జరగనుండడంతో అక్కడికి వెళ్తోంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఆ సినిమని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ షూట్ అయ్యాక ఆమె సర్కారు వారి పాట షూట్ కోసం అమెరికా వెళ్ళాల్సి ఉంది. ఇక ఆమె రకరకాల సినిమాలు ఒప్పుకుని బిజేబిజీగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: