
సితార మాత్రమే కాదు.. మహేశ్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రాంలో తరచుగా అప్డేట్స్ ఇస్తుంటారు. మహేశ్ భార్య, నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితార.. అందరూ సోషల్ మీడియాలో అప్టూడేట్ ఉంటారు. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంటారు
ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో 41 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గానూ మహేశ్కు నెటిజన్లు విపరీతంగా విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో 41YrsOfSSMBMasteryInTFI అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. నీడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు తెరకు పరిచయమైన మహేశ్.. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించారు. రాజకుమారుడు, బాబీ, టక్కరిదొంగ, అతడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, భరత్ అను నేను వంటి చిత్రాలతో అభిమానులను అలరించారు. రీసెంట్గా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పుడు సూపర్ స్టార్గా.. టాలీవుడ్లోనే నెంబర్ వన్ స్టార్గా ఎదిగారు. ప్రస్తుతం మహేశ్ `సర్కారు వారి పాట` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ జనవరి నుంచి మొదలు కాబోతోంది